ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది

రోజువారి జీవితంలో ఆటవిడుపుగా చేయగలిగినది
చేయాలనే ఆలోచన ఒక అంతర్మదనానికి దారి తీసింది

ఆ క్షణమే బాద్యతనెరిగినట్లు
జీవితంలో క్షణకాలం వెడలి
ఒకపరి రెండు మంచి మాటలు పలికి
పరమదయాలు అని బిరుదాంకితురాలివైన నీవు
మరలి వచ్చు వేళ ఆ చిన్నారి కనులకు
ఏమని బదులు చెప్పావు?

ఒక ప్రశ్న శరం నన్ను బ్రహ్మస్త్రమై తాకింది
కుంటి సాకులు చెపితే మోహం నిస్త్రానమయింది!

ఎవరికీ ఎవరు ఏమి కాని ఈ లోకాన
తాను అనాధనని తనకే తెలీని అలౌకిక ప్రయాణ
రెండు బన్ను ముక్కలిచ్చిన నిన్ను
ప్రియమార తడిమిన ఆ లేత చేతులకు
ఏమని బాస చేసి వచ్చావు?

ఆలోచన తరంగం ఉప్పెనలా నన్ను అలుముకుంది
మాటవరసకు కూడా జవాబు చెప్పలేని మనసు మూగపోయింది!

ఆ బోసినవ్వుల మోమును,ముదమార తాకితే
ఆ ప్రేమ తనకు శాశ్వతమనుకొని
స్వచమైన ప్రేమ తో ఆ లేత మనసు
నీ చెక్కిలి పై చేసిన మదుర సంతకానికి
ఏమని రాసిచ్చి వచ్చావు?

ఒక అవిశ్రాంత క్షణాన
కనురెప్పల మాటున
తెలీని ఆదుర్దా చాటున
బాష్పలోచన నయనాలతో
బాదాతప్త ముక్త కంఠము తో
మౌనం గా అంతరాలలో ఒక ఆలోచన శరం
నను సమాదానం చెప్పవేమని శోదిస్తున్నది


This entry was posted on 12:19 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

    నరసింహ మూర్తి said...

    ఈ కవిత చదివాక ఆ శరం నన్నూ వెంబడిస్తుంది... నా గమ్యం చేరే దాక

  1. ... on November 12, 2009 at 10:01 AM  

About Us